ఆర్సీబీ ఆవిర్భవించిన నాటి నుంచి, దాని ప్రయాణం, విరాట్ కోహ్లీతో ముడిపడి ఉంది. కొన్ని సందర్భాల్లో ఆనందం, మరికొన్ని సందర్భాల్లో నిరాశను, చూసిన ఈ బంధం, గత రెండు సీజన్లుగా మాత్రం, అభిమానులకు అపారమైన సంతోషాన్ని అందిస్తోంది.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అంటే, విరాట్ కోహ్లీ… విరాట్ కోహ్లీ అంటే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. ఈ రెండు పేర్లు ఒకదానితో, ఒకటి విడదీయరాని బంధంతో కలిసిపోయాయి. ఆర్సీబీ ఆవిర్భవించిన నాటి నుంచి, కోహ్లీ ఆ జట్టుతోనే ఉన్నాడు. ఎన్నో విజయాలు, ఎన్నో నిరాశలు చూసిన, ఈ ప్రయాణంలో చివరకు 2025లో, ఆర్సీబీ తన తొలి ఐపీఎల్ టైటిల్ను గెలుచుకుంది.
ఇప్పుడు మరోసారి, ఛాంపియన్గా నిలిచిన ఆర్సీబీ విజయానికి, ప్రధాన కారణం కూడా విరాట్ కోహ్లీనే. గుజరాత్ టైటాన్స్తో జరిగిన ఫైనల్లో, కోహ్లీ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడి, జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఒత్తిడి పరిస్థితుల్లోనూ, కాళ్లలో క్రాంప్స్ వచ్చినా కూడా, 75 పరుగులతో, అజేయంగా నిలిచి, తన జట్టుకు మరో గొప్ప విజయాన్ని అందించాడు.
ఈ సీజన్ మొత్తం, కోహ్లీతో కలిసి ఆడిన వెంకటేష్ అయ్యర్, తాజాగా, ఆయన గురించి ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు.
వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ… “విరాట్ కోహ్లీ తన జట్టును, ఓడిపోతున్న స్థితిలో చూడలేడు. అదే అతని గొప్పతనం. అతను మైదానంలో ఉన్నప్పుడు, ఎవరూ నిరుత్సాహంగా ఉండలేరు. మీరు కోహ్లీతో కలిసి, ఆడుతుంటే తలదించుకుని ఉండటం, నెమ్మదిగా నడవడం అసాధ్యం. ఎందుకంటే, ఇన్ని విజయాలు సాధించిన తర్వాత కూడా, అతనిలో ఉన్న ఆకలి, తీవ్రత ఏమాత్రం తగ్గలేదు” అని చెప్పాడు.
ఫైనల్లో, ఆర్సీబీ 156 పరుగుల, లక్ష్యాన్ని ఛేదిస్తున్న సమయంలో కోహ్లీ, వెంకటేష్ అయ్యర్ కలిసి, అద్భుత ఆరంభాన్ని ఇచ్చారు. జట్టు 62 పరుగుల వద్ద ఉండగా, రెండు వికెట్లు త్వరగా కోల్పోయింది. కానీ కోహ్లీ మాత్రం ఏమాత్రం, ఒత్తిడికి లోనుకాలేదు.
దీనిపై వెంకటేష్ అయ్యర్ మాట్లాడుతూ… “మాకు ఎలాంటి టెన్షన్ లేదు. ఎందుకంటే క్రీజ్లో విరాట్ కోహ్లీ ఉన్నాడు. అతని ఉనికే జట్టుకు నమ్మకాన్ని ఇస్తుంది. ఎన్నో సంవత్సరాలుగా కష్టపడి సంపాదించుకున్న గౌరవం అది. కోహ్లీ మైదానంలో ఉంటే, ప్రత్యర్థి జట్టుకు మానసిక ఒత్తిడి మొదలవుతుంది” అని చెప్పాడు.
ఇక కోహ్లీ విజయ రహస్యంపై కూడా, అయ్యర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. “విరాట్ చేసే ప్రతి పనికీ ఒక పద్ధతి ఉంటుంది. అతని ప్రాక్టీస్కు ఒక విధానం ఉంటుంది. మ్యాచ్ను అర్థం చేసుకునే తీరు, బౌలర్లను విశ్లేషించే విధానం, ప్రతి క్షణం అధిక ఉత్సాహంతో ఆడే తీరు… ఇవన్నీ అతన్ని ప్రత్యేకంగా నిలబెడతాయి” అని వివరించాడు.
అంతేకాకుండా, కోహ్లీ నుంచి తాను నేర్చుకున్న, అత్యంత ముఖ్యమైన విషయం గురించి కూడా, అయ్యర్ చెప్పాడు. “ఏ పని చేసినా స్పష్టతతో చేయాలి. అది డిఫెన్స్ ఆడటమైనా సరే. మనం ఏం చేయాలనుకుంటున్నామో, మనకు క్లారిటీ ఉంటే సగం పని పూర్తయినట్టే. కోహ్లీని చూస్తే నాకు ప్రతిసారి, ఇదే సందేశం గుర్తుకు వస్తుంది” అని పేర్కొన్నాడు.
ఇదే విరాట్ కోహ్లీ గొప్పతనం. కేవలం పరుగులు చేయడం మాత్రమే కాదు… తన ఉనికితోనే జట్టుకు ధైర్యాన్ని ఇవ్వడం, తన క్రమశిక్షణతో ఇతరులకు స్ఫూర్తిగా నిలవడం, ప్రతి క్షణం గెలుపు కోసం పోరాడటం. అందుకే ప్రపంచ క్రికెట్లో విరాట్ కోహ్లీని, ఒక లెజెండ్గా అభిమానులు గౌరవిస్తారు.


