Top 5 This Week

Related Posts

పంత్ ఔట్‌పై మాజీ భారత బ్యాటర్ సంచలన వ్యాఖ్యలు.. ‘కాస్త కామన్ సెన్స్ ఉండాలి’!

గాలే టెస్ట్‌లో వర్షం కారణంగా ఆటకు అంతరాయం ఏర్పడినా, భారత్ భారీ స్కోర్ దిశగా దూసుకెళ్తోంది. కానీ రిషబ్ పంత్ ఔట్‌తో పాటు ఆ తర్వాత వరుసగా వికెట్లు పడటంతో భారత జట్టుకు ఒక్కసారిగా షాక్ తగిలింది. రెండో రోజు ఆట ప్రారంభమయ్యే సమయానికి భారత్ 2 వికెట్లకు 288 పరుగులతో మంచి స్థితిలో ఉంది. కానీ వర్షం కారణంగా ఆ రోజు కేవలం 43 ఓవర్ల ఆట మాత్రమే సాధ్యమైంది. ఆ తక్కువ సమయంలోనే భారత్ ఏకంగా 7 వికెట్లు కోల్పోయింది. చివరకు రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 9 వికెట్లకు 460 పరుగులు చేసింది.

అయితే ఈ మ్యాచ్‌లో అందరి దృష్టిని ఆకర్షించిన విషయము రిషబ్ పంత్ ఔట్. శ్రీలంక బౌలర్లు 80 ఓవర్లు పూర్తయ్యాక కొత్త బంతిని తీసుకున్నారు. కొత్త బంతి తీసుకున్న తర్వాత ఏడో ఓవర్‌లోనే పంత్ బ్యాటింగ్‌కు ఇబ్బంది పడ్డాడు. శ్రీలంక తరఫున టెస్ట్ అరంగేట్రం చేస్తున్న ఆఫ్ స్పిన్నర్ కేశర నువంత, పంత్‌ను ఒక షాట్‌కు ప్రలోభపెట్టాడు. పంత్ ఆ బంతిని తొందరగా భారీ షాట్ ఆడేందుకు ప్రయత్నించాడు. కానీ బంతి వైడ్ లాంగ్ ఆఫ్ వైపు వెళ్లడంతో అక్కడ క్యాచ్ ఇచ్చి 39 పరుగుల వద్ద ఔటయ్యాడు.

పంత్ ఇలా ఔట్ అవ్వడంపై మాజీ భారత బ్యాటర్ మహ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. పంత్ ఆ విధంగా ఆడటం తన ఆటతీరు అని చెప్పిన కైఫ్, ఈ పరిస్థితిలో మాత్రం కొంచెం కామన్ సెన్స్ చూపించాల్సిందని విమర్శించాడు. కైఫ్ మాట్లాడుతూ.. “రిషబ్ పంత్ ఔట్ అయిన విధానంపై నాకు పెద్దగా ఫిర్యాదు లేదు. అతను ఇలానే ఆడతాడు. కానీ ఇక్కడ సమస్య కామన్ సెన్స్ గురించి. అది కొత్త బంతితో వేసిన మొదటి ఓవర్. అలాంటి సమయంలో కొంచెం జాగ్రత్తగా ఆడాలి” అని చెప్పాడు.

అంతేకాదు.. కొత్త బంతిని కనీసం ఐదు నుంచి ఆరు ఓవర్లు చూసిన తర్వాత షాట్లు ఆడాలని కైఫ్ సూచించాడు. టెస్ట్ క్రికెట్‌లో కొత్త బంతి వచ్చినప్పుడు బ్యాటర్లు కొంత సమయం తీసుకోవడం సాధారణమే అని చెప్పాడు. పంత్ ఆ ఓవర్ మొదటి బంతికే దూకి ,షాట్ ఆడటంతో తాను ఆశ్చర్యపోయానని కూడా కైఫ్ అన్నాడు. “ఒక బ్యాటర్ 150 పరుగులు చేసినా కొత్త బంతి వచ్చినప్పుడు కొన్ని బంతులను వదిలి ఆడతాడు. పరిస్థితిని బట్టి కొంచెం లెక్క వేసుకోవాలి.

కానీ పంత్ ఇక్కడ క్రికెట్ పరంగా సరైన నిర్ణయం తీసుకోలేకపోయాడు” అని కైఫ్ వ్యాఖ్యానించాడు. అయితే పంత్ వికెట్‌తో భారత్ పూర్తిగా వెనక్కి వెళ్లలేదు. భారత బ్యాటింగ్‌ను మూడో స్థానంలో వచ్చిన దేవదత్ పడిక్కల్ ముందుండి నడిపించాడు. అతను తన తొలి టెస్ట్ సెంచరీని అద్భుతంగా పూర్తి చేసి ఏకంగా 167 పరుగులు చేశాడు. ఆ తర్వాత ధ్రువ్ జురెల్ కూడా కీలకమైన హాఫ్ సెంచరీ చేసి భారత్ స్కోర్ 400 దాటేలా చేశాడు. ప్రస్తుతం గాలే పిచ్ స్పిన్నర్లకు అనుకూలంగా మారుతున్నా.. భారత్ 460 పరుగులతో బలమైన స్థితిలో ఉంది. అయితే పంత్ ఔట్ మాత్రం మరోసారి అతని షాట్ సెలెక్షన్‌పై ప్రశ్నలు లేవనెత్తింది.

కొత్త బంతి వచ్చిన వెంటనే ఇలాంటి రిస్క్ తీసుకోవడం సరైందా? లేక పంత్ తన సహజ ఆటనే కొనసాగించాలా? మీ అభిప్రాయం ఏంటి? ఇలాంటి ఆసక్తికరమైన updates కోసం మా channel ని Subscribe చేసుకుని, మీ అభిప్రాయాన్ని Comment రూపంలో తప్పకుండా చెప్పండి!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Popular Articles