ఇంగ్లాండ్తో జరిగిన మూడో టీ twenty మ్యాచ్లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలో బరిలోకి దిగిన భారత్ కేవలం 76 పరుగులకే ఆలౌట్ అయి 125 పరుగుల భారీ తేడాతో ఓటమి పాలైంది. దీంతో ఐదు మ్యాచ్ల సిరీస్లో భారత్ ఇప్పటివరకు ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేకపోయింది. ఇక మిగిలిన రెండు మ్యాచ్లు గెలిస్తే మాత్రమే సిరీస్ను సమం చేసే అవకాశం ఉంటుంది. ఈ ఓటమిపై మాజీ భారత కెప్టెన్ అనిల్ కుంబ్లే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. టీమిండియా ఆటను చూసి తాను చాలా నిరాశ చెందానని అన్నారు. ప్రపంచ ఛాంపియన్ జట్టు ఇలా పూర్తిగా చేతులెత్తేయడం అస్సలు ఊహించలేదని వ్యాఖ్యానించారు.
ఇంగ్లాండ్ ఫాస్ట్ బౌలర్లు జోఫ్రా ఆర్చర్, జోష్ టంగ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో భారత బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారని కుంబ్లే చెప్పారు. అవసరమైన రన్రేట్ ఎక్కువగా ఉన్నా, ఎవరో ఒకరు క్రీజులో నిలబడి ఇన్నింగ్స్ను ముందుకు తీసుకెళ్లాల్సిందని అన్నారు. కానీ ప్రతి బ్యాటర్ పెద్ద షాట్లు ఆడే ప్రయత్నం చేయడంతో వరుసగా వికెట్లు కోల్పోయారని చెప్పారు. అదే భారత్ ఓటమికి ప్రధాన కారణమని అభిప్రాయపడ్డారు. టీమ్ మేనేజ్మెంట్ తీసుకున్న ఒక నిర్ణయంపై కూడా కుంబ్లే తీవ్ర విమర్శలు చేశారు. శివమ్ దూబే కంటే ముందు హర్షిత్ రాణాను బ్యాటింగ్కు పంపడం పూర్తిగా తప్పు నిర్ణయమని అన్నారు.
టీ twenty క్రికెట్లో మంచి బ్యాటర్లను ముందుగా పంపాలే గానీ, ఎనిమిదో స్థానంలో ఆడే ఆటగాడిపై మ్యాచ్ గెలిపించే బాధ్యత పెట్టకూడదని స్పష్టం చేశారు. ఆధునిక క్రికెట్లో అలాంటి నిర్ణయాలు అసలు పని చేయవని చెప్పారు. అంతేకాదు, ప్రతి మ్యాచ్కు బౌలర్లను మార్చడం కూడా సరైన విధానం కాదని కుంబ్లే అభిప్రాయపడ్డారు. ఒక మ్యాచ్లో బాగా ఆడకపోయారనే కారణంతో ఆటగాళ్లను వెంటనే పక్కన పెట్టకూడదన్నారు. ప్రసిద్ధ్ కృష్ణ ఒక మ్యాచ్ తర్వాత జట్టుకు దూరమయ్యారని, అతని స్థానంలో వచ్చిన ప్రిన్స్ యాదవ్ మూడు వికెట్లు తీసినా జట్టు ఓడిపోయిందని గుర్తు చేశారు. కొత్త కెప్టెన్గా ఐదుగురు బౌలర్లపై నమ్మకం ఉంచాలని, వారిని వరుసగా అవకాశాలు ఇవ్వాలని సూచించారు.
బ్యాటర్లు ఎప్పుడో ఒకప్పుడు పరుగులు చేస్తారు. కానీ మ్యాచ్లు గెలిపించేది ఎక్కువగా బౌలర్లేనని చెప్పారు. చివరగా, ఒక ఆటగాడిని ఎంపిక చేసిన తర్వాత అతనికి పూర్తి మద్దతు ఇవ్వాలని కుంబ్లే సూచించారు. క్రికెట్లో విజయాలు, వైఫల్యాలు సహజమేనని, ఒకటి రెండు మ్యాచ్లలో విఫలమయ్యారని వెంటనే జట్టు నుంచి తప్పించడం సరైన విధానం కాదని ఆయన స్పష్టం చేశారు.


